Saturday, February 4, 2012

జ్ఞానసంపద


'బాలోత్సవ్‌-2010' 'కథారచన'లో సీనియర్‌లలో నాల్గవ బహుమతి పొందిన కథ;
రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.

నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.
అక్కడో లోయ ఉంది. ఆ లోయ లోపల ఏముందో చూడాలన్న ఆసక్తి కలిగింది. అమ్మానాన్నకు చెప్పకుండా

అపూర్వ


తనను రెండు కళ్లు గమనిస్తున్నాయని గుర్తించింది అపూర్వ.
ఆవైపుగా తనూ దృష్టి సారించింది.
అవే కళ్లు.. తనకిష్టమైన కళ్లు.. 15 ఏళ్ల తర్వాత…
ఆశ్చర్యంతో ఒక్క క్షణం చూసింది. వెంటనే కనుమరుగయ్యాయి.
ఇంకా చూడాలనిపించింది. కానీ అర్జున్‌ బండిమీద తాను.
అర్జున్‌ అపూర్వను అక్కడకు దగ్గరలోనే ఉన్న గ్రంథాలయం ముందు దించి, అరగంటలో వస్తానంటూ వెళ్లిపోయాడు.

‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’


దేవరాజు మహారాజుగారి అనువాదాల్లోంచి జాలువారిని ‘మంచి ముత్యం’ ఒక ‘ఆణిముత్యం’. ఆయన చేసిన అనువాదం ఆద్యంతం పాఠకులను ఆకట్టుకుంటుంది. నవల మూల రచయిత ఈయనేనా అన్నట్లుంది. ఎక్కడా ఎటువంటి తొట్రుపాటూ లేదు. లేశమంతైనా అతిశయోక్తి లేదు. మొదట్లో రచయిత గురించి చెపుతూ దేవరాజుగారు

కొత్త ‘మలుపే’



బడబాగ్ని శంకరరాజు ఉత్తమ ఉపాధ్యాయుడే కాదు.. సామాజిక దృష్టి, శాస్త్రీయ దృక్పథం కలిగినవాడు. ఈ ఉత్తమ లక్షణాలన్నీ ఆయన రాసిన ప్రతి కథలోనూ వెల్లివిరిశాయి. ఆయా ప్రాంతాల మాండలికాలను ఉపయోగించడమే కాకుండా సమాజంలో అన్యాయానికి గురయ్యే వారందరినీ ఒక్కొక్క కథలో ప్రస్తావించారు. ఆయన పుట్టింది నెల్లూరులో, ఉద్యోగం చేసేది విజయనగరంలో.. కానీ ఆయన కథలు సీమకు కళింగకు ముడిపెడుతూ ‘అదుపులేని పొదుపు’ కథ రాయడం ఆయన హృదయ విస్తృతికి అద్దం పడుతుంది. అయితే ఈ కథలో మరో ముఖ్య విషయాన్ని ‘మతం మత్తు మందులాంటిదని’ మార్క్సును తల్చుకున్న తీరు ప్రశంసనీయం. తాగుబోతువాడు, మతం మత్తులో ఉన్నోడూ ఒక్కటే అన్న పోలిక హేతుబద్దంగా ఉంది. పెత్తందారులకూ, దళితులకూ మధ్య అంతరాన్ని ఆయన ‘మృత్యుజలం’ కథలో ఎంతో హృద్యంగా వర్ణించారు. ఆస్తులు పంచుకున్న తర్వాత అన్నదమ్ములు కట్టుకున్న ఇళ్లలా పెత్తందార్ల, దళితుల పల్లెలు ఎడంఎడంగా ఉండడాన్ని వర్ణించడం సందర్భోచితంగా ఉంది. పెత్తందారి కొడుకు మోటుబావిలో పడిపోతే పండితుడు దేవుణ్ణి రక్షించమని వేడుకోవటం, దళితుడైన లోకేశు రక్షించేందుకు దూకబోతుంటే ‘అంటరానివాడివి’ అనటం మూఢత్వాన్ని తెలియజేసింది. మనుషుల

స్ఫూర్తిగా నిలవాలని..


ఆ బాలికకు పుట్టుకతోనే రెండుచేతులూ లేవు. అలా పుట్టిందని వాళ్లమ్మ మతిస్థిమితం కోల్పోయింది. రెండేళ్లప్పుడు కన్నతండ్రే రోడ్డుమీద వదిలి వెళ్లిపోయాడు. ఓ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన శిక్షతో అన్నిపనులూ తనే చేసుకొంటోంది. ‘మౌనంగానే ఎదగమని మొక్కనీకు చెపుతోంది’ అన్న పాట ఈ పాప ప్రావీణ్యానికి అతికినట్లుంది. రాయడం దగ్గర

సౌకర్యం … సౌలభ్యం!


నాడు నార చీరలు ధరించేవారంటే ఏమిటో అనుకున్నాం.. ఇప్పుడదే పెద్ద ఫ్యాషనై కూర్చుంది. అంతే కాదు జూట్‌ పర్యావరణాన్ని పదికాలాల పాటు కాపాడుతోంది. నేడు జూట్‌ (నార) బ్యాగుల దగ్గర నుంచి చీరలు, నగల వరకూ వ్యాప్తి చెందింది. ఇందు కలను అందులేను సందేహం వలదన్నట్లు అన్నింటా తానేనంటోంది.. అంటోంది ఏంటి మీరే చూడండి.. మహిళలు ధరించే బ్యాగులు, పిల్లలు స్కూలుబ్యాగులు, షాపింగ్‌ బ్యాగులు, పిల్లల బొమ్మలు, టేబుల్‌

పుస్తకం


చరిత్రను నింపుకుంటుంది
జీవితాల్ని చదివిస్తుంది
దు:ఖాన్ని కలిగిస్తుంది
విచారాన్ని వెల్లడిస్తుంది
కోపాన్ని వెళ్లగక్కుతుంది
ప్రేమను పంచుతుంది
ఉద్యమాలకు దిక్సూచవుతుంది
సమానత్వం పాటిస్తుంది
పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
తారతమ్యాలు లేవంటుంది
అన్నింటికీ చోటిస్తుంది
ఎద లోతుల్ని తడుముతుంది
అమ్మలా హత్తుకుంటుంది
నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
సహచరుడిలా తోడుంటుంది
నేస్తమై వెన్నంటి ఉంటుంది
రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
ప్రపంచాన్ని చూపిస్తుంది
నిజాల్ని వెల్లడిస్తుంది
అసత్యాల్నీ మూటగడుతుంది
కాగితాలను కలిపేసుకుంటుంది
కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
కథల్ని కళ్లకుగడుతుంది
గ్రంథాలను గౌరవిస్తుంది
రచయితలకు వెలుగునిస్తుంది
కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
విచక్షణను మేలుకొల్పుతుంది
విద్వేషాలనూ రగిలిస్తుంది
విప్లవాలను జ్వలింపజేస్తుంది
సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
పరిహాసాలకూ చోటిస్తుంది
దరహాసాలనూ చిందిస్తుంది
నిరసనలకూ వేదికవుతుంది
గర్వంతో మిడిసిపడుతుంది
మస్తిష్కాల్లో దూరిపోతుంది
మనస్సులను ప్రభావితం చేస్తుంది
చైతన్యాన్ని పెంపొందిస్తుంది
నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
ఆవేశాలను రగిలిస్తుంది
ఉత్సాహానికి పురికొల్పుతుంది
భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
తన ప్రస్థానం అనంతమంటుంది
తననెవరూ ఆపలేరంటుంది
తనకెవరూ ఎదురులేరంటుంది

- శాంతిశ్రీ

నీవు.. నేను.. సమం


ఆకాశంలో.. సగం నీవు సగం నేను
అనంతకోటి నక్షత్రాల్లో..సగం నీవు సగం నేను
సంగీతంలో
రాగం నీవు తానం నేను

స్నేహం…


విజయాన్ని గుండెలకు హత్తుకునేది
ఓటమి ముంగిట ఓదార్చేది
కన్నీటి భాషను చదవగలిగేది
స్నేహమొక్కటే.. అదే లేకపోతే

Saturday, May 7, 2011

అమ్మ చెప్పిన ఎనిమిది అబద్ధాలు..


చిన్నారులూ....!
'అమ్మ అన్నది ఒక కమ్మని మాట... అది ఎన్నో ఎన్నో తెలియని మమతల మూట..' అన్నాడో సినీకవి.
అమ్మకో రోజు.. నాన్నకో రోజు... కేటాయించి 'ప్రేమ'ను సరుకుగా మార్చి, వ్యాపారం చేసుకునే సంస్కృతి నేటి మార్కెట్‌వ్యవస్థలో సర్వసాధారణమైపోయింది. ఈ భ్రమలో పడి ఆ ఒక్కరోజుకే పరిమితం కాకుండా అమ్మానాన్నను కలకాలం ప్రేమించండి. అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైంది. కల్మషం లేనిది. అయితే అమ్మ అప్పుడప్పుడూ మనతో కొన్ని అబద్ధాలూ చెపుతూ ఉంటుంది కదూ! ఇవి ప్రతి ఒక్కరికీ అనుభవమే.. అందుకే మీలాంటి ఓ చిన్నారి తనతో అమ్మ చెప్పిన ఎనిమిది అబద్ధాల గురించి ఒక కథ చెప్తున్నాడు.. ఈ కథ మన హృదయాల్ని తడుతూ.. మనందరి జ్ఞాపకాలతో పందరి వేస్తుంది.. మరి ఆ కథేంటో చదవండి...!

Saturday, January 1, 2011

జ్ఞానసంపద

'బాలోత్సవ్‌-2010' 'కథారచన'లో సీనియర్‌లలో నాల్గవ బహుమతి పొందిన కథ;  
రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.


    నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.

    Tuesday, December 21, 2010

    సమానత్వం.. (కథ)

    సునీతకు చిన్నప్పటి నుంచి క్రిస్మస్‌ చెట్టు పెట్టాలని కోరిక..
    దానికి చాక్లేట్లు వేలాడదీయాలని, గ్రీటింగ్స్‌ కట్టాలని.. శాంతాక్లాజ్‌ తాత నుంచి బహుమతి పొందాలని అభిలాష.
    కానీ వాళ్ల నాన్నకి కోపం కాస్త జాస్తి. ఒక రకంగా సాంప్రదాయాలికి విలువ ఇచ్చే మనిషి. ఆయన్ని క్ర్ర్రిస్మస్‌ చెట్టు పెట్టాలని అడగడానికి సునీతకు ధైర్యం చాలలేదు. చివరకు క్రిస్మస్‌ చెట్టు మాట, శాంతాక్లాజ్‌ తాత బహుమతి మాట మరుగున పడిపోయాయి.

    Sunday, November 21, 2010

    ఆఖరి ఆకు

    - శాంతిశ్రీ 
    '' 'ది లాస్ట్‌ లీఫ్‌' అనే పేరుతో ఓ. హెన్రీ అనే ప్రసిద్ధ అమెరికన్‌ రచయిత కలం నుండి ఈ కథ జాలువారింది. ఇది మా చిన్నప్పుడు చదువుకున్న కథ. ఈ ఏడాది మీకోసం చెపుతున్నా. మీరందరూ ఇది మీ మీ ఇళ్లకు వెళ్లాక, మీ తల్లి దండ్రులకు, స్నేహితులకు చెప్పండి..'' అంటూ డా|| రమేష్‌ మామయ్య కథ చెప్పటం ప్రారంభించారు.. కథలోకి వెళితే..

    బాలోత్సాహం వెల్లివిరిసిన బాలోత్సవ్‌

      - శాంతిశ్రీ

    అనగనగా కథలు..
    బుడి బుడి నడకలు..
    బుజ్జి బుజ్జి రాగాలు..
    చిట్టి చిట్టి కవితలు..
    చిన్ని చిన్ని చిత్రాలు..
    కేరింతలు.. తుళ్లింతలు..
    ఆనంద డోలికలు.. ఆహ్లాద వీచికలు..
    మధురం.. సుమధురం..
    'బాలోత్సవ్‌-2010' పిల్లల పండుగ..

    Friday, November 19, 2010

    చలికాలంలో జాగ్రత్తలు

    రోజూ ఉదయాన్నే లేవగానే గడియారం చూస్తే చిన్న ముల్లు పెద్దముల్లుతో పోటీపడి పరిగెడుతున్నట్లు అనిపిస్తోంది కదూ! మరోపక్కేమో మంచంమీద నుంచి లేవబుద్ధి కావడంలేదు కూడా! మరి వాతావరణం చల్లగా చల్లగా ఉంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ? ఎందుకేంటండీ... చలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమును తినేయడమే కాదు మన శరీరంమీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రధానంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, జుట్టుకు ఎదురయ్యే సమస్యలకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరి... మరి ఆ చిన్నపాటి జాగ్రత్తలు ఏమిటో మీరే చదవండి...

    చిగురుటాకు

     (కథ)

    - శాంతిశ్రీ

    అనగా అనగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద కాండం ఉంది. ఆ కాండానికి అనేక పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మలకు చిన్ని చిన్ని రెమ్మలు ఉన్నాయి. ఆ రెమ్మలుకు కొన్ని పండుటాకులు, కొన్ని ముదురు ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని లేత ఆకుపచ్చరంగు ఆకులు, కొన్ని చిగురుటాకులు ఉన్నాయి. చల్లటి గాలి వీస్తోంది. ఆ చల్లటి గాలికి ఆకులన్నిటికీ జోకొట్టినట్లుంది. కొద్దిసేపటికి సూర్యకిరణాలు వెచ్చగా తగిలేటప్పటికి అవి ఉలిక్కిపడి లేచాయి. ఓ చిగురుటాకు ఆనందంతో కేరింతలు కొట్టింది. ఇంతలో దానికి ఓ చక్కని పాట లీలగా వినిపించింది. ఆలకిస్తున్న కొద్దీ చిగురుటాకుకు ఆ పాట చాలా సుమధురంగా అనిపించింది. ఆ పాట చుట్టూ ఉన్న చెట్లమీద నుంచి వినిపిస్తోందని చిగురుటాకు గమనించింది. ఈ పాటను మర్రి చెట్టుమీద పండుటాకులు కూడా విన్నాయి. అవి కూడా వాటితో గళం కలిపాయి.

    దుబాయిలో జీవన చిత్రం

    - శాంతిశ్రీ
    మనిషి నిరంతర అన్వేషి. కొత్త విషయాలను తెలుసుకోవడం మన ప్రవృత్తిలోనే దాగుంది. మరో ప్రాంతపు సంస్కృతీ సాంప్రదాయాలను తెలుసుకోవడం, అందులోని మంచిని గ్రహించడం ఎంతో ఆసక్తి కలిగించే అంశం. అదే మనిషి ఎదుగుదలకు, వ్యక్తిత్వ నిర్మాణానికీ మూలకేంద్రం. ఆ కుతూహలమే నాకు తెలియని మరో ప్రపంచాన్ని నా ఎదుట నిలిపింది. నా విజయవాడ ప్రయాణం అనుకోని వ్యక్తుల పరిచయానికి దారితీసింది. ఆ పరిచయం మరో దేశపు అలవాట్లు, ఆచారాలు తెలుసుకునే వేదికగా మారింది. రిజర్వేషన్‌ లేకపోవడంతో జనరల్‌బోగీలో ఎక్కిన నాకు ఎదురుగా వున్న మహిళ వేషభాషలు, తీరుతెన్నులు ఆమె ఆర్థిక ఉన్నతిని తెలియజేస్తున్నాయి. ఆమె ఇలా జనరల్‌బోగీలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితేంటో అనుకున్నా... అడగడం సభ్యతకాదని ఊరుకున్నా.

    పుస్తకం

    - శాంతిశ్రీ
    చరిత్రను నింపుకుంటుంది
    జీవితాల్ని చదివిస్తుంది
    దు:ఖాన్ని కలిగిస్తుంది
    విచారాన్ని వెల్లడిస్తుంది
    కోపాన్ని వెళ్లగక్కుతుంది
    ప్రేమను పంచుతుంది
    ఉద్యమాలకు దిక్సూచవుతుంది
    సమానత్వం పాటిస్తుంది
    పేద-గొప్ప స్త్రీ-పురుష చిన్నా-పెద్ద
    మంచీ-చెడ్డా ప్రేమ-కోపం
    తారతమ్యాలు లేవంటుంది
    అన్నింటికీ చోటిస్తుంది
    ఎద లోతుల్ని తడుముతుంది
    అమ్మలా హత్తుకుంటుంది
    నాన్నలా దిశను నిర్దేశిస్తుంది
    సహచరుడిలా తోడుంటుంది
    నేస్తమై వెన్నంటి ఉంటుంది
    రెక్కలున్నట్లే ఎగిరిపోతుంది
    ప్రపంచాన్ని చూపిస్తుంది
    నిజాల్ని వెల్లడిస్తుంది
    అసత్యాల్నీ మూటగడుతుంది
    కాగితాలను కలిపేసుకుంటుంది
    కవిత్వాల్ని కౌగిలించుకుంటుంది
    కథల్ని కళ్లకుగడుతుంది
    గ్రంథాలను గౌరవిస్తుంది
    రచయితలకు వెలుగునిస్తుంది
    కొత్తదనాన్ని రుచి చూపిస్తుంది
    పాతదనాన్ని సమీక్షిస్తుంటుంది
    విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది
    విచక్షణను మేలుకొల్పుతుంది
    విద్వేషాలనూ రగిలిస్తుంది
    విప్లవాలను జ్వలింపజేస్తుంది
    సాహిత్య సేద్యంలో కీలకమవుతుంది
    భాండాగారాల్లో నిక్షిప్తమౌతుంది
    పరిజ్ఞానానికి ఆధారమవుతుంది
    పరిహాసాలకూ చోటిస్తుంది
    దరహాసాలనూ చిందిస్తుంది
    నిరసనలకూ వేదికవుతుంది
    గర్వంతో మిడిసిపడుతుంది
    మస్తిష్కాల్లో దూరిపోతుంది
    మనస్సులను ప్రభావితం చేస్తుంది
    చైతన్యాన్ని పెంపొందిస్తుంది
    నిరుత్సాహాన్ని కలిగిస్తుంది
    ఉత్తేజాన్ని రేకెత్తిస్తుంది
    ఆవేశాలను రగిలిస్తుంది
    ఉత్సాహానికి పురికొల్పుతుంది
    భావోద్వేగాలకి ఆలవాలమవుతుంది
    బాధ్యతల్ని గుర్తు చేస్తుంది
    తన ప్రస్థానం అనంతమంటుంది
    తననెవరూ ఆపలేరంటుంది
    తనకెవరూ ఎదురులేరంటుంది

    స్నేహం...

    - శాంతిశ్రీ
    విజయాన్ని గుండెలకు హత్తుకునేది
    ఓటమి ముంగిట ఓదార్చేది
    కన్నీటి భాషను చదవగలిగేది
    స్నేహమొక్కటే.. అదే లేకపోతే
    జీవితానికి అర్థమేమిటి?

    ఆనందాన్ని పంచేది
    బాధలను దూరం చేసేది
    బతుకులోని బాంధవ్యాన్ని
    ఎప్పుడడిగినా ఇచ్చేది
    ఆత్మీయత ఒక్కటే.. అదే లేకపోతే
    మనుగడలో మాధుర్యమేమిటి?

    కుగ్రామంగా మారిన ప్రపంచంలో
    అమ్మలా నడిపించేది
    నాన్నలా బాధ్యతగలది
    మైత్రి ఒక్కటే.. అదే లేకపోతే
    లోకంలో మిగిలేదేమిటి?
    స్వార్థం దరిజేరనిది
    మోసానికి చోటులేనిది
    నేస్తమొక్కటే.. అదే లేకపోతే
    సహజీవన సూత్రమేమిటి?

    శూన్యం తరుముతున్నా
    కన్నీటి కట్టలు తెగిపోయినా
    ఆనందపు అలలలో కొట్టుకుపోయినా
    స్నేహ కవచం.. నీచుట్టూ ఉంటే
    విజయం నీవెంట.. విజేతవు నీవేనంట..

    (స్నేహితులకు అంకితం...)

    Wednesday, November 17, 2010

    అక్టోబర్‌ విప్లవం .. స్ఫూర్తిదాయకం ..

    - శాంతిశ్రీ   Sat, 6 Nov 2010,  

    అదే అక్టోబర్‌ విప్లవం. ఇదే జారు చక్రవర్తికి, అతని రాజ్యానికి వ్యతిరేకంగా లెనిన్‌ నాయకత్వంలో జరిగిన 'బోల్షివిక్‌ విప్లవం'. పాత క్యాలెండర్‌ ప్రకారం ఆ విప్లవం అక్టోబర్‌ 17వ తేదీన జరిగింది. అందుకే అది 'అక్టోబర్‌ విప్లవం'గా పిలువబడింది. కొత్త క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 7వ తేదీ అవుతుంది. అందుకే నవంబర్‌ 7వ తేదీనే 'అక్టోబర్‌ విప్లవ దినోత్సవం'.సరే.. రష్యాలో అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. అది 1905వ సంవత్సరం. ఆ ఏడు రష్యాలో పెద్ద తిరుగుబాటు వచ్చింది. ప్రవాసంలో ఉన్న లెనిన్‌ తిరిగి వచ్చాడు. ఆయనే ఆ