Saturday, January 1, 2011

జ్ఞానసంపద

'బాలోత్సవ్‌-2010' 'కథారచన'లో సీనియర్‌లలో నాల్గవ బహుమతి పొందిన కథ;  
రచన: జి.వినయ్, (ఇంగ్లీషులో) వి.వి.విద్యాలయం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.


    నేను చాలా అల్లరి పిల్లవాణ్ణి. నాకు ఐదేళ్లు. మా కుటుంబసభ్యులతో కలిసి ఒకసారి తిరుపతి వెళ్లాను. మేమంతా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని కొండపైకి నడుచుకుంటూ వెళుతున్నాము. అలా ఎక్కుతూ ఉంటే చుట్టూ ఉన్న ప్రకృతి నాకు బాగా నచ్చింది. ఆ మొక్కలు, పూలు ఎంతో బాగున్నాయి. సరిగ్గా మార్గం మధ్యలోకి వచ్చాము.